ఏపీ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా

9 Mar, 2015 14:48 IST
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఈరోజు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే  రైతు సమస్యలపై  ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. తమ వాయిదా తీర్మానాలపై  చర్చ జరపాలని  విపక్షం డిమాండ్‌ చేసింది.  అయితే చర్చకు సిద్ధమన్న ప్రభుత్వం మరో ఫార్మెట్‌లో రావాలని సూచించింది.