హైదరాబాద్, 8 నవంబర్ 2013: గుంటూరు జిల్లా తెనాలి టీడీపీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ కుమారుడు శివకుమార్ శుక్రవారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ముఖ్యఅనుచరుడిగా మెలగిన విజయనగరం జిల్లాకు చెందిన మీసాల వరహాల నాయుడు కూడా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వీరిద్దరూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తెనాలి నియోజకవర్గం టీడీపీలో కీలక నాయకుడిగా శివకుమార్ వ్యవహరిస్తున్నారు. తెనాలిలో ప్రముఖ విద్యాసంస్ధల ఛైర్మన్గా కూడా శివకుమార్కు ప్రత్యేకంగా గుర్తింపు ఉంది.
హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఉన్న శ్రీ జగన్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో తన ముఖ్య అనుచరులతో పాటు శివకుమార్ శ్రీ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇదిలా ఉంటే పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లా విజయనగరంలో కాంగ్రెస్ పార్టీకి... బొత్స సత్యనారాయణకు జిల్లా నాయకుడు మీసాల వరహాలనాయుడు షాక్ ఇచ్చారు. బొత్స ముఖ్య అనుచరుడిగాను, చీపురుపల్లి కాంగ్రెస్ పార్టలో కీలక నేతగా మీసాల వరహాలనాయుడు ఇంత వరకూ వ్యవహరించారు. వరహాలనాయుడి సతీమణి సరోజిని చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్గా ఇటీవలే ఇండిపెండెంట్గా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు.