ఈనెల 30న బంద్

28 Nov, 2015 15:24 IST
చంద్రబాబు ప్రభుత్వంపై అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు భగ్గుమంటున్నారు. వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. దీనికి తోడు గత కొద్ది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కార్యకర్తల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గత కొన్నాళ్లుగా అంగన్ వాడీలు తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఐనా, వారి సమస్యలు నెరవేర్చకుండా పచ్చసర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది

 పెంచిన వేతనాల అమలు కోసం హామీ కాదు జీవో ఇవ్వాలి అనే నినాదంతో ..ఈనెల 30న అన్ని అంగన్ వాడీ కేంద్రాలను బంద్ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఏపీ అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లలిత బంద్ కు పిలుపునిచ్చారు.