నరసాపురం: మాజీ మంత్రి, వైఎస్సాఆర్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పడవల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి తణుకులో తలపెట్టిన రైతు దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ పడవల్లో వినూత్నంగా ప్రచారం నిర్వహించారు.