ఏపీ శాసనమండలి: శాసన మండలి సభ్యుడిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభ్యుల కోటా నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ తరఫున ఆళ్లనాని, గంగుల ప్రభాకర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ చక్రపాణి ఆళ్లనాని చేత ప్రమాణం చేయించి, ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.