అన్నీ ఆ ఎంపీ ఫంక్షన్ హాల్లోనే
25 May, 2016 12:29 IST
విజయవాడ: కలెక్టర్ల సదస్సు పేరుతో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. టీడీపీ ఎంపీకి చెందిన ఓ ఫంక్షన్హాల్కు లాభాలు చేకూర్చేందుకు ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేస్తోంది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సుల పేరుతో కోట్లాది రూపాయలను ప్రభుత్వం తన పార్టీ నేతలకు దోచిపెడుతోంది. ఓ ఎంపీకి చెందిన ఫంక్షన్ హాల్లో సదస్సులను నిర్వహిస్తూ నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.