పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: వైయస్ వివేకానందరెడ్డి
8 Jul, 2016 17:47 IST
అనంతపురంః వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడులను వైయస్సార్సీపీ సీనియర్ నాయకుడు వైయస్ వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైయస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాబోయే ఐదు నెలల పాటు ఇంటింటికీ వైయస్సార్ కార్యక్రమాన్ని గడపగడపకూ తీసుకెళ్తున్నామని వైయస్ వివేకానంద రెడ్డి తెలిపారు. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.