కాగితాలకే పరిమితమైన దగదర్తి విమానాశ్రయం
3 Jun, 2018 14:29 IST
నెల్లూరు: కమీషన్ల కోసమే టీడీపీ నేతలు పనులు చేస్తున్నారని కావలి నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పాల్గొన్నారు. దగదర్తి విమానశ్రయం ఏర్పాటు ఇంకా కాగితాల్లో ఉందని విమర్శించారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతల మధ్య కమీషన్లు కుదరకపోవడంతో జాప్యం జరుగుతుందన్నారు. ప్రతి పనిలో కమీషన్లు వెతుక్కుంటూ రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నాడని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా జన్మభూమి కమిటీల పేరుతో అరాచకాలు చేస్తున్నారన్నారు.