విద్యార్థుల గల్లంతుపై ఆందోళన

16 Aug, 2016 16:04 IST
గుంటూరుః

అమరావతి వద్ద కృష్ణా పుష్కరాల్లో విషాదం జరిగింది. కృష్ణా నదిలో గల్లంతై ఐదుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై  ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్  తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పుష్కర స్నానం చేయడానికి నదిలో దిగిన ఐదుగురు యువకులు నీట మునిగి మరణించారు.  నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు