ఆల్‌ ది బెస్ట్‌ .. జగన్‌ అన్నా

15 Jan, 2018 14:20 IST
 హైదరాబాద్‌ : ప్రజలకు ఏదో మంచి చేయాలన్న తపన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిలో బలంగా ఉందని సినీ నటుడు సూర్య అన్నారు. అందుకే గొప్ప ఆలోచనతో వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారని ఆయన తెలిపారు. వైయ‌స్‌ జగన్‌కు కష్టపడేతత్వం ఎక్కువ. పైగా ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎంత దూరమైన వెళ్తారు అని సూర్య పేర్కొన్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచే తనకు వైయ‌స్‌ఆర్‌ కుటుంబంతో పరిచయం ఉందని సూర్య చెప్పారు. వైయ‌స్‌ జగన్‌, తాను కలుసుకున్నప్పుడు తమ మధ్య రాజకీయ అంశాల ప్రస్తావన పెద్దగా చర్చకు రావని.. అయినప్పటికీ ప్రజలకు ఏదో చేయాలన్న బలమైన తపన వైయ‌స్‌ జగన్‌లో తాను గమనించానన్నారు. మహానేత, దివంగత సీఎం వైయ‌స్ రాజశేఖరరెడ్డిని కోల్పోవడం అందరికీ తీరని లోటని చెప్పారు. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చాలా ప్రాధాన్యం కలిగిందని.. ప్రస్తుతం జగనన్న చేస్తున్న పాదయాత్ర కూడా అదే తరహాలో విజయవంతం కావాలని కోరుకుంటూ సూర్య ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.