తూర్పు గోదావరి : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర కు ఆకర్షితుడై సినీ నటుడు కృష్ణుడు వైయస్ఆర్సీపీలో చేరారు. సోమవారం పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో వైయస్ జగన్ సమక్షంలో నటుడు కృష్ణుడు పార్టీలో చేరారు. కృష్ణుడికి పార్టీ కుండువా కప్పి వైయస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కృష్ణుడు మాట్లాడుతూ.. జననేత వైయస్ జగన్ పాదయాత్రతో స్ఫూర్తి పొంది తాను పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైయస్ఆర్ సీపీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు పేర్కొన్నారు. ఈ క్యార్యక్రమంలో పార్టీ నేతలు పెన్మత్స సురేష్ బాబు, సర్రాజు, సూర్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.