ఆనం సోదరులకు మతిభ్రమించింది: చెవిరెడ్డి
9 Jun, 2013 16:32 IST
తిరుపతి, 9 జూన్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడమే ఆనం సోదరులు పనిగా పెట్టుకున్నారని పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆనం సోదరులు మతిభ్రమించి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదవీ వ్యామోహంతో సోనియా మెప్పు పొందేందుకే వారు శ్రీ జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆనం సోదరులకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.
టిడిపిలో గుర్తింపు పొందేందుకే వర్ల రామయ్య అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెవిరెడ్డి దెప్పిపొడిచారు. టిడిపి -కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు త్వరలో గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.