32వ రోజు పాదయాత్ర 17 కిలోమీటర్లు

17 Nov, 2012 18:42 IST
కోడుమూరు:

మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం ఆదివారం నాటికి 32వ రోజుకు చేరుకుంటుంది. కొంపహాడ్ నుంచి ఆదివారం ఉదయం షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తారు. సి. బెలగల్, పొలకల్జులకల్ వరకూ సాగుతుంది. ఆదివారంనాడు షర్మిల మొత్తం 17 కిలోమీటర్లు నడుస్తారని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురామ్ ఓ ప్రకటనలో తెలిపారు.