22న ఖమ్మం జిల్లాలోకి పాదయాత్ర

17 Apr, 2013 10:37 IST
విజయవాడ, 17 ఏప్రిల్ 2013:

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈనెల 22న ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తుందని పాదయాత్ర సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నాయకులు కేకే మహేందర్‌రెడ్డి ప్రకటించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని గండ్రాయి గ్రామం దాటాక కృష్ణా జిల్లాలో పాదయాత్రను పూర్తిచేసి.. మధిర నియోజకవర్గం వల్లభి గ్రామం మీదుగా షర్మిల ఖమ్మం జిల్లాలోకి అడుగుపెడతారని వారు చెప్పారు. జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాల్లో 200 కిలోమీటర్ల మేర నడుస్తారని, యాత్ర దాదాపు 15 రోజుల పాటు కొనసాగుతుందని వివరించారు.