162వ రోజు మరో ప్రజాప్రస్థానం సాగేదిలా
28 May, 2013 14:23 IST
పాలకొల్లు (ప.గో.జిల్లా),
28 మే 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 162వ రోజు మంగళవారం 5.6 కిలోమీటర్లు కొనసాగుతుంది. రాజోలు అడ్డరోడ్డు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర పాలకొల్లు చేరుతుందని పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. పాలకొల్లు మార్కెట్ యార్డు వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీమతి షర్మిల నిరశన దీక్ష చేస్తారని వారు వెల్లడించారు.