వైఎస్ఆర్ కడప జిల్లా: గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయాలన్న డిమాండ్తో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి వీరపునాయునిపల్లెలో నిరాహార దీక్ష చేపట్టారు. మంగళవారం మూడో రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే దీక్షకు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులు విచ్చేసి సంఘీభావం ప్రకటించారు.