వైయస్ఆర్ సీపీలో 100 మంది చేరిక
21 Oct, 2017 12:47 IST
కర్నూలు: రానున్న రోజుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అవుకు పట్టణంలో కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్ కుటుంబం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలకు రాష్ట్ర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా వైయస్ఆర్ సీపీతో మమేకం అవుతున్నారన్నారు. అవుకు పట్టణానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు కాటసాని ఆధ్వర్యంలో వైయస్ఆర్ సీపీలో చేరారు.