వైయస్‌ఆర్‌సీపీలో వంద మంది యువకుల చేరిక

29 Sep, 2018 15:12 IST
నెల్లూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై వివిధ పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి  క్యూకడుతున్నారు. తాజాగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బాలాజీ నగర్‌కు చెందిన వంద మంది యువకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.