డల్లాస్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని ఆయన అభిమానులు, డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి పౌండేషన్ సభ్యులు, వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. డల్లాస్లో మహానేత వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహానేత సేవలను, ప్రజాసంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరితోను ఆప్యాయంగా ఉంటారని వైఎస్సార్తో ఉన్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం వైయస్ఆర్ పౌండేషన్, వైయస్ఆర్సీపీ నేతల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.