'కువైట్కు, ఖతార్లలో వైయస్కు నివాళి'
అంతర్వేది (తూర్పుగోదావరి జిల్లా), 4 సెప్టెంబర్ 2012 : మహానేత వైయస్రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు కువైట్, ఖతార్లలోని ప్రవాసాంధ్రులు నివాళులర్పించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు ఖతార్ రాజధాని దోహాలో వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రాష్ట్ర ప్రజలకు వైయస్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. వైయస్ వర్ధంతిని సందర్భంగా దోహాలో నిర్వహించిన వైయస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దోహా వైయస్ఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ప్రకాశబాబు, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.