విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చేస్తున్న డ్రామాలను వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు.
మీడియా కవరేజ్ కోసం ఒక రోజు తండ్రి డ్రామా చేస్తాడు - మరొక రోజు చిట్టి నాయుడి వంతు. గులకరాయితో రాని సానుభూతి నీ అలిపిరి డ్రామాతో వస్తుందా చిట్టీ? మీ నాన్నకు అలిపిరిలో బాంబు పెడితేనే జనం పట్టించుకోలేదు - నువ్వెళ్ళి అలిపిరిలో డ్రామా చేస్తే సానుభూతి వస్తుందా? అంటూ విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.