వైయస్ విజయమ్మ సైకత శిల్పం
8 Mar, 2021 12:14 IST
నెల్లూరు: మహిళా దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సైకత శిల్పాన్ని మంచాల సనత్కుమార్ రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, నవ్యాంధ్రకు వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రులుగా చేయడంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కీలకంగా వ్యవహరించారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకత శిల్పి మంచాల సనత్కుమార్ ప్రశంసించారు.