నేడు జిల్లాల అధ్యక్షులతో వైయస్ జగన్ భేటీ
29 Apr, 2025 09:27 IST
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ జిల్లాల అధ్యక్షులతో పార్టీ అధినేత వైయస్ జగన్ మంగళవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. తాజా పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.