గౌతమ్.. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను
2 Nov, 2025 19:27 IST
తాడేపల్లి: ఏపీ మాజీ మంత్రి, దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన్ను మరోసారి వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు భావోద్వేగ సందేశాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ‘‘నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని చాలా మిస్ అవుతున్నాను’’ అని ట్వీట్లో వైయస్ జగన్ పేర్కొన్నారు