న్యూఢిల్లీ: ప్రధాని ఆవాస్ యోజన పథకం క్రింద 350 చ. అడుగుల ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న రూ. 1.8 లక్షలు ఎందుకూ సరిపోవడం లేదని, గిరిజనులు నివాసిత ప్రాంతాల్లో.. దానిని రూ. 3 లక్షలకు పెంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ జి. మాధవి విజ్ఞప్తి చేశారు. లోక్ సభలో మంగళవారం ఆమె మాట్లాడారు.