కర్నూలు: బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు.బీసీలకు అండగా ఉన్నది వైయస్ఆరేనని అన్నారు.బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని వైయస్ జగన్ నెరవేరుస్తారని తెలిపారు.వైయస్ జగన్ బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు మేలు చేస్తారని తెలిపారు.చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చంద్రబాబు ఉపయోగించుకున్నారన్నారు.వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.