వైయస్ జగన్ సీఎం అయితేనే బీసీలకు మేలు
17 Feb, 2019 15:31 IST
ఏలూరు: వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీసీలు హాయిగా ఉండేవారన్నారు. చంద్రబాబు పాలనలో బీసీలకు కష్టాలు తప్పడం లేదన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. బీసీల ద్రోహి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.