గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద వైయస్ఆర్సీపీ నేతల ధర్నా
14 Jul, 2025 15:10 IST
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పలువురు నేతలు ఫ్లెక్సీలు పట్టుకొని నినాదాలు చేశారు. వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.