ఒక్క ఓటు తొలగించినా సహించం
18 Feb, 2019 14:45 IST
గుంటూరు: విచారణ జరపకుండా ఒక్క ఓటు తొలగించినా సహించబోమని వైయస్ఆర్సీపీ నేత కాసు మహేష్రెడ్డి హెచ్చరించారు. పిడుగురాళ్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద వైయస్ఆర్సీపీ కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారని ఆందోళన చేపట్టారు. కరాలపాడు గ్రామానికి చెందిన 900 ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. అధికారులతో వైయస్ఆర్సీపీ నేత కాసు మహేష్రెడ్డి మాట్లాడారు.