రేపు వైయ‌స్ జగన్ కీల‌క మీడియా స‌మావేశం

4 Mar, 2025 21:49 IST

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ , మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు కీల‌క మీడియా స‌మావేశం నిర్వహించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును మీడియా సమావేశంలో వైయ‌స్ జగన్ ఎండగట్టనున్నారు.

అంకెలగారడీగా మారిన రాష్ట్ర బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలులో మోసం, అన్నదాతల కష్టాలు, అక్రమ అరెస్టులు సహా అనేక అంశాలపై వైయ‌స్ జగన్ మాట్లాడనున్నారు.