నా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారు
31 Mar, 2019 16:23 IST
పశ్చిమగోదావరి: తన ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారంటూ వైయస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఎన్నికల అధికారికి,భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 29న భీమవరంలో జరిగిన సినీ అభిమానుల సమావేశంలో తన ప్రసంగాన్ని తప్పుగా చూపించారని తెలిపారు. ప్రసంగం వీడియోను రఘురామ కృష్ణంరాజు తరపు లాయర్ పోలీసులకు అందజేశారు.