సౌదీ ప్రమాదంపై వైయ‌స్ జగన్ దిగ్భ్రాంతి 

17 Nov, 2025 15:56 IST

తాడేపల్లి: సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై వైయ‌స్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైయ‌స్‌ జగన్‌ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలని జగన్‌ పిలుపునిచ్చారు.