తటస్థులతో వైయస్‌ జగన్‌ భేటీ

11 Feb, 2019 13:08 IST

 అనంతపురం: తటస్థులతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతలో సమర శంఖారావం సభ సందర్భంగా ముందుగా అన్న పిలుపులో భాగంగా తటస్థ ఓటర్లతో వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. వారి సందేహాలను నివృత్తి చేస్తూ, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. తటస్థులతో భేటీ అనంతరం బెంగళూరు రోడ్డులో ఉన్న అశోక్‌ లేల్యాండ్‌ షోరూమ్‌ ఎదురుగా ఉన్న స్థలంలో అనంతపురం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో సమర శంఖారావం సభలో పాల్గొని ప్రసంగిస్తారు.