నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైయస్ జగన్ సమావేశం
28 Jan, 2026 11:28 IST
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇందులో పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.