రేపు ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైయస్ జగన్ సమావేశం
18 Dec, 2024 13:37 IST
తాడేపల్లి: ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.