తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఐ పోలవరం మండలం మురమళ్ళలో నాలుగో ఏడాది వైయస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరారు. 10.45 గంటలకు మురమళ్ళ వేదిక వద్దకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం వైయస్ జగన్ వెంట మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్ ఉన్నారు.