వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యులతో వైయస్ జగన్ భేటీ
22 Apr, 2025 11:41 IST
తాడేపల్లి: వైయస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. తాజాగా 33 మంది సభ్యులతో పీఏసీని ఏర్పాటు చేయగా.. పీఏసీ ఏర్పాటు తర్వాత మొదటిసారి మీటింగ్ నిర్వహిస్తున్నారు.