తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆలూరు సాంబశివారెడ్డిని సీఎం వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సలహాదారులుగా నియమించారు. ఈ మేరకు ఆలూరు సాంబశివారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.