వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ రాళ్ల దాడి
25 Feb, 2019 11:03 IST
గుంటూరు: రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు ఎక్కువయ్యాయి. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..గ్రామంలోని మండపాల సెంటర్ నుంచి వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. దీంతో వారంతా పరుగులు తీశారు. ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది. దాడితో పార్టీ కార్యకర్తలు జాన్బాషా, సుభాని, హుస్సేన్లకు గాయాలయ్యాయి.