విజయవాడ: తెలుగు దేశం పార్టీకి విజయవాడ నగరంలో షాక్ తగిలింది. టీడీపీ తరఫున 40వ డివిజన్ నుంచి బీఫామ్ తీíకున్న చెవుల ఆంజనేయులు టీడీపీకి రాజీనామా చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో ఆంజనేయులు వైయస్ఆర్సీపీలో చేరారు. ఆంజనేయులుతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వైయస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.