అమరావతి: నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ పర్యటనకు వెళ్లేందుకు కొద్ది సేపటి క్రితమే రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైయస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు.