తాడేపల్లి: 2020 – 21 సోషియో ఎకనామిక్ సర్వేని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా ఎకనామిక్ సర్వేను ఆవిష్కరింపజేశారు. కార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రణాళిక శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి విజయ్కుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.