తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు నగర పార్టీ అధ్యక్షురాలిగా సిత్ర సత్యనారాయణమ్మను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. సత్యనారాయణమ్మ నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.