ప్రకాశం: చీరాలలో దాడికి గురై న దళిత సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కన్నుమూశారు. దీంతో కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ నుంచి సీఎంవో కార్యాలయ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.