వైయస్‌ఆర్‌సీపీలోకి కవిటి ఎంపీపీ దంపతులు..

7 Jan, 2019 12:18 IST

శ్రీకాకుళంఃవైయస్‌ జగన్‌ సిద్ధాంతాలు,వైయస్‌ఆర్‌సీపీ అమలుచేయబోయే సంక్షేమç ³థకాలకు ఆకర్షితులై వైయస్‌ఆర్‌సీపీలోకి వివిధ పార్టీల నేతల వలసలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా వైయస్‌ఆర్‌సీపీలోకి కవిటి ఎంపీపీ కిరణ్‌కుమారి దంపతులు వైయస్‌ జగన్‌ సమక్షంలో 21 పంచాయతీల క్యాడర్‌తో కలిసి వైయస్‌ఆర్‌సీపీలోకి  చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరత్నాలు ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.రోబోయే ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తామన్నారు.గత నాలుగున్నరేళ్ల టీడీపీలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు.సామాన్య ప్రజలకు మేలు జరగలేదు.టీడీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు.