ప్ర‌తీ ఒక్క‌రి గుండెల్లోనూ వైయ‌స్ఆర్‌

2 Sep, 2020 11:05 IST


విశాఖ‌:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌తీ ఒక్క‌రి గుండెల్లోనూ చిర‌స్థాయిగా నిలిచిపోయార‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కొనియాడారు. బుధ‌వారం దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని విశాఖ న‌గ‌రంలోని వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, పార్టీ నాయ‌కులు పూల‌మాల‌లు వేసి   ఘ‌నంగా నివాళులు అర్పించారు.  ఈ సంద‌ర్భంగా మ‌హానేత సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. అనంత‌రం ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.