అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘చంద్రం..మళ్ళీ దళిత రాజకీయం మొదలుపెట్టావా? సీఎం వైయస్ జగన్ గారు శ్రీకారం చుట్టిన 'స‘వైయస్సార్ ఆసర' నుంచి ప్రజల దృష్టి మరల్చడమే మీ కుతంత్రం కదా? కానీ మీ కుట్ర విఫలం.‘వైయస్సార్ ఆసరా' సఫలం. మళ్ళీ వినండి..మాట నిలబెట్టుకొని తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లమ్మల ఖాతాలో వైయస్ జగన్ గారు జమ చేశారు’అని పేర్కొన్నారు.