విశాఖ: దావోస్ సదస్సులకు ఎగబడి వెళ్లిన చంద్రబాబు, లోకేశ్ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. దావోస్ పర్యటనలకు వీళ్లు పెట్టిన ఖర్చెంతో ప్రభుత్వం ఎలాగూ లెక్క తీస్తుంది. 2019 జనవరిలో దావోస్ సదస్సు తర్వాత లోకేశ్ టీం10 రోజులు అమెరికాలో తిరిగొచ్చింది. దాని సంగతీ తేలుస్తామని విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.