తండ్రీకొడుకులు ఉన్మాదుల్లా ఆనందిస్తున్నారు
30 Apr, 2021 11:53 IST
విశాఖ: కరోనా నేపథ్యంలో తప్పుడు ప్రచారం చేస్తూ చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ వేదికగా మండిపడ్డారు. టీవీల్లో కనిపించే సామూహిక శవ దహనాలు, ఆక్సిజన్ లేక సొమ్మసిల్లిన రోగుల దృశ్యాలు మన రాష్ట్రంలోనివి కావని ఆ తండ్రీకొడుకులు బాగా తెలుసు. ఇంకో రాష్ట్రాన్ని వేలెత్తి చూపే ధైర్యం లేక ప్రతిదీ జగన్ గారి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించి ఉన్మాదుల్లా ఆనందిస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.