దేవతకు, దెయ్యనికి తేడా తెలియదా బాబూ?
25 Feb, 2021 12:04 IST
విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహార శైలిపై వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో పతనం తర్వాత చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయింది. విగ్రహాల ధ్వంసం ప్లాన్ రివర్స్ కావడంతో ఇప్పుడు స్వామీజీలను ఆడిపోసుకుంటున్నాడు. కళ్లు బైర్లుకమ్మి లోక కళ్యాణం కోసం చేసే రాజశ్యామల యాగం కూడా అతనికి క్షుద్రపూజలా కనిపిస్తోంది. దేవతకు, దెయ్యనికి తేడా తెలియదా బాబూ? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.